Amrabad | అమ్రాబాద్లో ముఖ్యమంత్రి పర్యటన..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికాసేపట్లో నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం (Amrabad) మాచవరంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్రమ నిర్బంధాలకు పాల్పడుతున్నారు. అమ్రాబాద్ మండలంలోని బీఆర్ఎస్ శ్రేణులు, చెంచు నాయకులను ముందస్తు అరెస్టు చేశారు.అమ్రాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికాసేపట్లో నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం (Amrabad) మాచవరంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్రమ నిర్బంధాలకు పాల్పడుతున్నారు. అమ్రాబాద్ మండలంలోని బీఆర్ఎస్ శ్రేణులు, చెంచు నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పలువురు చెంచు నాయకులు మాట్లాడుతూ.. చెంచుల కోసం తెచ్చిన పథకాలలో భాగంగా పోడు భూములు కలిగిన కొంతమంది రైతులకు ఈ పథకాన్ని పరిచయం చేస్తున్నారన్నారు.అదేవిధంగా చెంచుల అభివృద్ధి కోసం మన్ననూరులో ఐటీడీఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఇక్కడున్న నైటీరియా కార్యాలయాన్ని ఇతర ప్రాంతాలకు తరలించారని, దానిని తిరిగి మన్ననూర్కు తీసుకురావాలన్నారు. చెంచుల కోసం ఏర్పాటుచేసిన ముఖ్యమంత్రి సమావేశానికి చెంచు నాయకులను అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు. హామీ ఇచ్చిన అన్ని పథకాలను అమలుచేస్తామని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం లంబాడి గిరిజనులను అరెస్టు చేయడం ఏంటన్నారు. అరెస్టయిన వారిలో చర్లపల్లి గ్రామానికి చెందిన చెంచు నాయకులు మల్లికార్జున్, గురువయ్య ఉన్నారు.
Naveen Kamera
ఒక ధర్నా .. రెండు జాతీయ పార్టీలు టార్గెట్
5 జూన్, 2025
3 వేలకు చేరువైన కరోనా కేసులు
31 మే, 2025
సీఎం రేవంత్ రెడ్డితో హీరో నాగార్జున భేటీ
31 మే, 2025
మహబూబ్ నగర్ లో ట్రిపుల్ ఐటీ క్యాంపస్
28 మే, 2025
14 పంటలకు మద్దతు ధర పెంపు
28 మే, 2025
Most Popular
● Tirumala | తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్..
16 మే, 2025
